Kangana Ranaut: ‘చంద్రముఖి 2’ ప్రమోషన్లలో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న కంగనా..!

  • September 26, 2023 / 02:32 PM IST

2009 లో పూరి జగన్నాథ్- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కంగనా రనౌత్. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకో బాక్సాఫీస్ వద్ద అంతగా పెర్ఫార్మ్ చేయలేదు. ఆ సినిమాలో కంగనా లుక్స్ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ.. ఆ సినిమా సెట్స్ లో బాగా ఎంజాయ్ చేసానని, ప్రభాస్ ఆతిధ్యం ఎప్పటికీ మర్చిపోలేను అని, ప్రతిరోజూ అతను తన ఇంటి నుండి క్యారేజ్ తీసుకొచ్చి కడుపు నింపేవాడని ఆమె చెప్పుకొచ్చింది.

భవిష్యత్తులో ‘ఏక్ నిరంజన్ 2 ‘ కనుక చేయాల్సి వస్తే ప్రభాస్ కోసం తప్పకుండా చేస్తాను అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది అని ఈమె మరోసారి గతాన్ని తవ్వుకుంది. వాస్తవానికి ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ గా ఈమెనే నటించాల్సి ఉంది. కానీ అప్పుడు హిందీలో ‘గ్యాంగ్ స్టర్’ అనే మూవీలో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల.. ఆ సినిమా ఆఫర్ వదులుకోవాల్సి వచ్చిందట.

ఈ విషయాన్ని (Kangana Ranaut) కంగనా ‘చంద్రముఖి 2 ‘ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా 2006 లో రిలీజ్ అయ్యి.. ఎవ్వరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలియానాకి కూడా టాలీవుడ్ లో స్టార్ డంని తెచ్చిపెట్టింది ఆ సినిమా. ‘పోకిరి’ తో కనుక డెబ్యూ ఇచ్చి ఉంటే కంగనా తెలుగులో కూడా టాప్ స్టార్ గా ఎదిగేది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus