కంగనా సోదరిపై యాసిడ్ దాడి.. ఏం జరిగిందంటే..?

  • March 22, 2021 / 08:02 PM IST

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో హీరోయిన్ కంగనా రనౌత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కంగనా రనౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సోదరి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైందని అందువల్లే 54 సర్జరీలు చేయించాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

రంగోలి ఒక వ్యక్తి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆ వ్యక్తి ఆమెపై యాసిడ్ తో దాడి చేశాడు. అవినాష్ శర్మ అనే కాలేజ్ స్టూడెంట్ రంగోలిపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో కంగనా వయస్సు కేవలం 19 సంవత్సరాలు. లవ్ ప్రపోజల్ ను తిరస్కరించినందుకు అవినాష్ ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మరోవైపు కంగనా రనౌత్ ప్రతి విషయంపై స్పందిస్తూ కొన్ని విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

కంగనా వ్యాఖ్యలకు ఆమె సోదరి రంగోలి నుంచి మద్దతు లభిస్తూ ఉండటం గమనార్హం. వ్యవసాయ చట్టాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా హృతిక్ రోషన్ తో డేటింగ్ చేయడం ద్వారా కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రంగోలిపై యాసిడ్ దాడి జరిగిన సమయంలో కంగనా కుటుంబం పేదరికంలో ఉండటంతో ఆమె కంగనాకు ఆపరేషన్ చేయించలేకపోయారు. నటిగా ఎదిగిన తరువాత కంగనా దేశంలోని ప్రముఖ డాక్టర్లతో సర్జరీ చేయించడంతో పాటు రంగోలికి పూర్వపు రూపం వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికీ రంగోలీకి చికిత్స కొనసాగుతోందని ఆమె తెలిపారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus