ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కపట నాటక సూత్రధారి’

  • October 21, 2022 / 09:37 PM IST

ప్రస్తుతం సినిమాలో సత్తా ఉంటే.. కంటెంట్ కొత్తగా ఉంటే.. థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్‌ ను దక్కించుకుంటున్నాయి. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌ కంటే.. కొత్తదనం ఉన్న సినిమాలను జనాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన చిత్రం కపట నాటక సూత్రధారి.

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కపట నాటక సూత్రధారి’ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు నుండి ఈ చిత్రం ఆహా స్ట్రీమింగ్ అవుతుంది. క్రాంతి సైన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు. వికాస్ బడిస రీ రికార్డింగ్ ,సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ, రామ్ తవ్వ సంగీతం, రామకృష్ణ మాటలు అందించడం జరిగింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus