ఆవిడకు అయిదుగురు పిల్లలట !

తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి కరీనా ఇటీవలే లండన్ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చింది. వీరిద్దరూ భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే కరీనా గర్భవతి అంటూ ప్రచారం సాగింది. ఈ వార్తలపై ఆమె స్పందించారు. తన జీవితంలోని విశేషాలను ప్రపంచంతో పంచుకుంటానని చెప్పిన కరీనా.. ‘అంతా దైవనిర్ణయం. నేనొక మహిళను.

ప్రస్తుతం నేను గర్భం దల్చానని చెప్పడానికి ఏమీ లేద’ని తెలిపింది. మరోవైపు ‘ నేను గర్భవతి నన్న వార్త నాకు ఎంతో సంతోషానిచ్చింది. నాకు ఐదుగురు పిల్లలుకూడా ఉన్నారు వారిని నేను లండన్ లో దాచి ఉంచాను’ అంటూ కరీనా చమత్కరించిది. కాగా ఆమె నటించిన ఉడ్తా పంజాబ్ చిత్రం ప్రస్తుతం సెన్సార్ చిక్కులు ఎదుర్కొంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus