టాప్ హీరోయిన్స్ తో పథకాల ప్రచారం చేస్తున్న కేసీఆర్!

  • October 13, 2017 / 02:25 PM IST

రాజీకీయ వేత్తలు, క్రీడాకారులు, సినీ స్టార్లు.. వీరికి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఏ విషయమైనా వీరి ద్వారా చెబితే వేగంగా ప్రజల్లోకి వెళుతుంది. అందుకేనేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సీయం అయినా వెంటనే టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. ఆ తర్వాత చేనేత పరిశ్రమను కాపాడాలని క్యూట్ బ్యూటీ సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తెలంగాణ రాష్ట్రం తరఫున ‘భేటీ బచావో భేటీ పడావో’ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు.

వీరిని సెలక్ట్ చేయడంతో పథకాలు ప్రజల్లోకి వెళ్లడమే కాదు పార్టీ కూడా ప్రజల్లో స్థిరపడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్టార్స్ ఏ కార్యక్రమానికి వెళ్లినా, సీఎం గురించి తప్పకుండా ప్రస్తావిస్తారు..సోషల్ మీడియాలోనూ కేసీఆర్, కేటీఆర్ గురించి పోస్ట్ లు చేస్తుంటారు. సో అటు ప్రజలకు మేలుతో పాటు ఇటు టీఆర్ ఎస్ పార్టీ కి ప్రయోజనకరంగా కేసీఆర్ మంచి ప్లాన్ వేశారని అంటున్నారు. ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నడుస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus