యూనిట్ కి గోల్డ్ కాయిన్స్ పంచిన కీర్తి సురేష్

  • January 22, 2018 / 11:56 AM IST

సినిమాల్లోని కొన్ని పాత్రలు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రేక్షకులకంటే ముందుగానే ఆర్టిస్టులపై ఎఫెక్ట్ ఉంటుంది. అందుకు సాక్ష్యమే ఈ సంఘటన. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. అందుకోసం కీర్తి.. సావిత్రిలా కట్టు బొట్టు అలవాటు చేసుకుంది. అభినయంతో అదరగొడుతోంది. అయితే సావిత్రికి తన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత యూనిట్ సభ్యులకు గిఫ్ట్ లు ఇవ్వడం అలవాటని సీనియర్ నటులు చెప్పేవారు. ఆ అలవాటు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగించింది.

మహానటి సినిమాకు పనిచేసిన యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్‌ గా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో యూనిట్‌ సభ్యులు ఆనందపడ్డారు. వెండితెరపైనే సావిత్రిలా నటించడమే కాదు.. నిజజీవితంలోను సావిత్రిలా కీర్తి సురేష్ మారిపోయిందని యూనిట్ సభ్యులు చెప్పారు. సావిత్రి రోల్ ఆమెను ఆవిధంగా మార్చేసిందని వెల్లడించారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పోటీగా అలనాటి నటి జమునగా సమంత నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేష్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా మర్చి 29 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus