దసరాని టార్గెట్ చేసిన ‘మహానటి’..!

  • April 1, 2019 / 11:50 AM IST

తెలుగు ,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుంతుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంతో ఆమె క్రేజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసింది కీర్తి. తెలుగులో మాత్రం మహానటి తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. నరేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , కమల్ కామరాజ్ ,నదియా, భాను శ్రీ మెహతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కోసం 50లక్షల తో ఓ సెట్ వేశారంట. ఈ సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఈ చిత్ర బృందం విదేశాలకు వెళ్ళనుందని సమాచారం. సినిమా మేజర్ మొత్తం అక్కడే జరుపనున్నారట. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా విజయదశమి రోజున విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కళ్యాణ్ రామ్ తో ‘118’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ కోనేరు ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదలచేయనున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus