తెలుగులో కొత్త సినిమాకి సైన్ చేయని కీర్తి సురేష్.!

  • April 5, 2018 / 01:11 PM IST

నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగులో తొలి అడుగుతోనే హిట్ కొట్టింది. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. తమిళంలోనూ ఆమె నటించిన రెమో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పట్టేసింది. అజ్ఞాతవాసి సినిమాలో  పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం  అందుకుంది. అలాగే సావిత్రి బయోపిక్ లో లీడ్ రోల్ చేసింది. అజ్ఞాతవాసి రిలీజ్ కి ముందు వరకు కీర్తి సురేష్ డేట్స్ కోసం తెలుగు నిర్మాతలు క్యూలో ఉన్నారు. తమ సినిమా ఒప్పుకుంటే చాలని డైరక్టర్లు భావించారు. మహేష్ బాబు పక్కన నటించమని కూడా కోరారు.

కొరటాల శివ ఆమె డేట్స్ అడిగితే అడ్జస్ట్ చేయలేకపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమె గురించి మాట్లాడుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం తెలుగులో ఏ కొత్త సినిమాకి సంతకం చేయలేదు. తెలుగు దర్శకనిర్మాతలే ఆమెను పక్కన పెట్టారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. దీంతో కీర్తి.. మహానటి సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. అది హిట్ అయితే తెలుగులో ఆఫర్లు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్… విక్రమ్ తో సామి 2, విశాల్ తో శాండాకోజి2(పందెంకోడి 2 ), తలపథి 2 అనే మూడు తమిళ సినిమాలు చేస్తోంది. వీటి ఫలితం ఆమె కెరీర్ పై ప్రభావం చూపనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus