ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య సరసన రకుల్, కీర్తి సురేష్!

  • July 18, 2018 / 05:40 AM IST

“మహానటి” సినిమాతో తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన కీర్తిసురేష్ మరోమారు అదే పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అది కూడా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ లోనూ కీర్తి సురేష్ మరోమారు సావిత్రిగా నటించనుంది. “మహానటి”లో సావిత్రిగా కీర్తి సురేష్ ను చూసిన క్రిష్ కంటికి మరో నటి ఎవరూ సావిత్రిగా రుచించడం లేదట. అందుకే కీర్తి సురేష్ ను సంప్రదించగా వెంటనే ఒప్పుకొందట కీర్తి సురేష్.

అదే తరహాలో ఎన్టీఆర్ తో అత్యధిక చిత్రాల్లో నటించిన శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను ఫైనల్ చేశారని అధికారిక సమాచారం. ఈ ఇద్దరు అతి త్వరలోనే “ఎన్టీఆర్” బయోపిక్ షూట్ లో పాల్గొననున్నారట. ఆల్రెడీ విద్యాబాలన్ ఈ చిత్రంలో బసవతారకంగా నటించనుండగా.. ఇప్పుడు కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా ఈ లిస్ట్ లో యాడ్ అవ్వడంతో రోజురోజుకీ సినిమాకి ప్రాముఖ్యత పెరిగిపోతుంది. మరి ఈ బయోపిక్ లో ఇంకెంతమంది తారామణులు చేరానున్నారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus