భలే భలే మగాడివోయ్ పక్కన కీర్తి

  • June 16, 2016 / 02:35 PM IST

శైలజ.. శైలజ.. అంటూ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో డోలు బాజ కొట్టింది కీర్తి సురేష్. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నఈ మలయాళీ భామ నటించిన తొలి తెలుగు సినిమా “నేను శైలజ”. ఈ మూవీతోనే కుర్రకారుల మది దోచుకుంది. తెలుగులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుందని అంతా అనుకున్నారు.

కథ పక్కకు తిరిగింది. ఆమెను తెలుగు సినీ నిర్మాతలు సంప్రదించేలోపే తమిళ సినిమాలతోనే బిజీ అయిపోయింది. వరుసగా ఆరు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మరో మలయాళం చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. ఈ బిజీ వల్ల పవన్ కళ్యాణ్ సినిమా లో నటించే అవకాశాన్ని కూడా కీర్తి సురేష్ వదిలేసుకుంది. ఆమెని తెలుగులో మళ్లీ నటింప చేయాలనే ప్రయత్నాలు సక్సస్ అయ్యాయి.

సినిమా చూపిస్తా మామ సినిమా డైరక్టర్  త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్టు తెలిసింది. దిల్ రాజు నిర్మించనున్నఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. నాని సినిమాలకు డీఎస్ పీ పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus