‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ … ఎన్టీఆర్ క్యారెక్టర్ ను థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్లో డిజైన్ చేసాడట..!

  • September 15, 2020 / 05:50 PM IST

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఇతనితో సినిమా చెయ్యాలని మన టాలీవుడ్ హీరోలు కూడా ఎగబడుతున్నారు. అయితే ఆ సువర్ణ అవకాశం మాత్రం ఎన్టీఆర్ కే దక్కింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉండబోతుందని.. వారు పరోక్షంగా ప్రకటించారు. అయితే ముందుగా ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ను ఫినిష్ చేసుకుని రావాలి.

మరోపక్క ఎన్టీఆర్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ ప్రాజెక్టుతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుని కూడా ప్యార్లల్ గా మొదలు పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టుని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అప్పట్లో పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన పరిస్థుతులను.. ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ‘కె.జి.ఎఫ్’ లో రాఖీభాయ్ పాత్రను మించేలా ఉంటుందట. దర్శకుడు ఎంతో శ్రద్ద పెట్టి ఆ పాత్రను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. 2021 చివర్లో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 2022 చివర్లో లేదా 2023 ఆరంభంలో ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు టాక్.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus