Srinidhi Shetty: చివరి సారిగా చూసిన టాలీ వుడ్ సినిమా అదే!

  • July 19, 2022 / 06:58 PM IST

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీనిధి శెట్టికి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మిస్ దివా ఇండియా పోటీల్లో భాగంగా గెలుపొందిన తన ఫోటోలను అన్ని పత్రికలలోను వేసారని ఆ ఫోటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆడిషన్స్ కి రమ్మని పిలిచారు అంటూ ఈ సందర్భంగా తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి తెలిపారు. ఈ విధంగా ఆడిషన్స్ ద్వారా తాను ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇకపోతే కేజిఎఫ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని మేము ఊహించలేదు.

ఈ సినిమా హిట్ అయిన తర్వాత మేము అలాంటి పెద్ద హిట్ సినిమాను తీసామా అని తెలిసింది అంటూ ఈమె వెల్లడించారు. ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెను యాంకర్ ప్రశ్నిస్తూ మీరు సినిమాలు చూస్తారా అని ప్రశ్నించగా తాను సినిమాల పిచ్చిదాన్ని అని అన్ని భాషలలో సినిమాలు చూస్తానని ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు.

ఇక తెలుగులో మీరు చివరిసారిగా చూసిన సినిమా ఏంటి అని ప్రశ్నించగా ఈమె తెలుగులో చివరిసారిగా మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా చూసానని అదే తన చివరి సినిమా అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చారు. ఇక తన తదుపరి సినిమాల విషయాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని అవన్నీ కూడా చర్చల దశలో ఉన్నాయని తెలిపారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus