టాలీవుడ్ గురించి అనేక విషయాలు చెప్పిన కైరా అద్వానీ.!

  • April 6, 2018 / 08:08 AM IST

ధోని బయోపిక్ చిత్రం ద్వారా హీరోయిన్ గా బ్యూటీ కైరా అద్వానీ పరిచయమైంది. ఈ చిత్రంతో గుర్తింపు లభించినా బాలీవుడ్ లో ఆమెకు మంచి అవకాశాలు తలుపు తట్టలేదు. అయితే టాలీవుడ్ నుంచి మంచి ఛాన్స్ పట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించే అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఈ అమ్మడు మరో మంచి ఛాన్స్ అందుకుంది. బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇలా తెలుగులో సినీ అవకాశాలపై ఓ జాతీయమీడియాలో కైరా అద్వానీ స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమపై అభినందనలు కురిపించింది. “తెలుగులో అమూల్యమైన తొలి అవకాశం వచ్చింది.

భరత్ అనే నేను మంచి ప్రాజక్ట్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథ, ప్రతిభగల దర్శకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించడం సంతోషం. డెడికేషన్ గల మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది” అంటూ ప్రశంసలు గుప్పించింది. ఈ మూవీ ఈనెల 20 న రిలీజ్ కానుంది. త్వరలో కైరా అద్వానీ బోయపాటి దర్శకత్వంలో నటించనుంది. ఈ నెల ఆఖరి వారంలో మొదలయ్యే షెడ్యూల్లో జాయిన్ కానుంది. ఈ ప్రాజక్ట్ గురించి కైరా మాట్లాడుతూ.. “రామ్ చరణ్ గురించి చాలామంది బాగా చెప్పారు. త్వరలో అతని గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోనున్నాను” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus