ఆ సీక్వెల్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు..!

  • January 3, 2019 / 12:22 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌ కు పరిచయమయ్యింది కైరా అద్వానీ. తొలి చిత్రంతోనే తన అందంతో పాటు నటనతో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులముందుకు రావడానికి సిద్దమయ్యింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. మరోవైపు బాలీవుడ్‌లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా కైరా.. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటించబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. 2009లో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్ కోసం ఇంతియాజ్.. కైరాను కలిసినట్టు ఈ వార్తలు నడిచాయి. తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది కైరా. ” ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. ‘ఇంతియాజ్‌ అలీ తర్వాతి సినిమాకు నేను సంతకం చేసినట్లు ఓ వార్తా పత్రిక రాసుకొచ్చింది. ఆ వార్తలు నిజం అయితే బాగుంటుందని.. నేనూ కోరుకుంటున్నా. అయితే ఈ ప్రచారంలో మాత్రం నిజం లేదు…” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus