బయోపిక్ లో నటించే అవకాశం అందుకున్న కైరా అద్వానీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా  బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ‘లస్ట్‌ స్టోరీస్’ వెబ్ సిరీస్ లోను అలరించింది.  ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ చరణ్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్న కైరా తాజాగా మరో భారీ ఛాన్స్ అందుకుంది. పరమవీర చక్ర బిరుదును పొందిన అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరుణ్ జోహార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు.

సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో కైరా అద్వానీ నటించే ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో ఆమె పోషించే రోల్  కీలకం కానుందని సమాచారం. మంచి సినిమాలో ముఖ్యమైన రోల్ దొరకడంతో కైరా ఆనందంలో ఉంది. కరణ్ జోహార్ మూవీలో ఛాన్స్ రావడం నిజంగా తన అదృష్టమని సంబరపడుతోంది. ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. సినీ తారలు, క్రీడాకారుల జీవితాలు కమర్షియల్ గా అవిజయం సాధిస్తున్నాయి. అందుకే జవాన్ జీవితంపై తెరకెక్కే బయోపిక్ పై ఆసక్తి నెలకొని ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus