టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన కైరా అద్వానీ

  • August 18, 2018 / 12:00 PM IST

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కైరా ఆకట్టుకుంది. తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. భరత్ అనే నేను తర్వాత కైరా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా కైరా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. తనను డైరక్టర్ బోయపాటి టార్చెర్ పెట్టారని వెల్లడించింది. “కొత్త చిత్రంలో బోయపాటి శ్రీను ఒక భావోద్వేగమైన సన్నివేశాన్ని నాపై చిత్రీకరించారు. అయితే ఈసన్నివేశం అత్యంత కీలకం కావడంతో నన్ను 32 సార్లు ఏడ్పించారు. అంటే 32 సార్లు టేక్స్ తీసుకున్నారు.

ఆ సన్నివేశం చాలా ముఖ్యమైనది కావడంతో నేను ఎన్నిసార్లు నటించినా ఆ సీన్ బాగుండలేదంటూ బోయపాటి చెప్పేవారు” అంటూ షూటింగ్ సంగతులు తెలిపింది. బోయపాటి టార్చర్ తాను ఇప్పట్లో మరిచిపోలేనని వెల్లడించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లోని తన నటనకు విమర్శకుల లభించినా, బోయపాటి ప్రశంసలు తనకు రావడానికి తాను పడ్డ కష్టాన్ని వివరించింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే టైటిల్ పై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చరణ్ మూవీ టైటిల్ ని రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus