ఎన్టీఆర్ 27 చిత్రానికి మాటలు అందించనున్న కోన వెంకట్

  • December 19, 2016 / 07:28 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రానికి సంబంధించిన పనుల్లో వేగం పుంజుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఆయన చేయనున్న సినిమాకు టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపిక పూర్తి అయింది. నందమూరి కళ్యాణ్ రామ్ స్థాపించిన  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్నారు. దర్శకుడిగా బాబీని ప్రకటించినప్పటి నుంచి ఒక్కొక్కరి పేరు బయటికి వస్తోంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని ఎంపిక చేసిన చిత్రం బృందం.. ఈ టీమ్లోకి స్టార్ రైటర్ కోన వెంకట్ ని తీసుకున్నారు.

గతంలో సాంబ, అదుర్స్, బాద్ షా చిత్రాలను కోన మాటలు అందించారు. మళ్లీ ఈ చిత్రానికి పెన్ సహకారం ఇవ్వనున్నారు. యాక్షన్ సీన్స్ ని బాబీ అద్భుతంగా తెరకెక్కించగలరు. కోన వెంకట్ డైలాగ్స్ తో నవ్వులు పూయించగలరు. వీరిద్దరిని కలిపితే సినిమా రేంజ్ పెరుగుతుందని ఎన్టీఆర్ అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ త్వరలో అధికారికంగా నిర్మాత ప్రకటించనున్నారు. సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. అందుకే తారక్ కొత్త లుక్కులో అదరగొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. వంద కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ అనుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus