నెంబర్ వన్ షో గా ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’

  • May 23, 2016 / 03:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి బుల్లితెర షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. ప్రదీప్ స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకున్నకొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే షో లో సందడి చేశారు. ఈ షో కి సంబంధించిన ప్రోమో చేసిన హడావుడితో ఆదివారం జీ తెలుగు చానల్ కి యువత అతుక్కుపోతారు.

షో లో మొదటి నుంచి చివరి వరకు హోస్ట్ ప్రదీప్ అడిగే చిలిపి ప్రశ్నలకు మహేష్ చిరు నవ్వుతో సమాధానాలు ఇచ్చారు. చిన్నప్పుడు స్కూల్ బంక్ కొట్టి బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేసానని, ఇప్పటివరకు తనే కాదు, తన భార్య కూడా గరిట పట్టలేదని మహేష్ సింపుల్ గా చెబుతుంటే ఆయన అభిమానులు చానల్ మార్చలేక పోయారు. తన అమ్మమ్మ చేసే ములక్కాయ్ మటన్ కూర ఇష్ట మని, వాస్తవానికి డైటింగ్ పేరుతో ఎప్పుడూ నచ్చే ఫుడ్ కి దూరంగా లేనని స్పష్టం చేశారు. ప్రదీప్ చేసే అల్లరి, నటనను చూసిన మహేష్ “నీకు టీవీ షో లే బెటర్” అని అభినందించారు. తనకి కుటుంబమే ప్రపంచమని, తండ్రితో కలిసి భోజనం చేయడం ఎంత సంతోషం ఇస్తుందో, తన పిల్లలతో ఆడుకోవడం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందని సొంత విషయాలు సూపర్ స్టార్ పంచుకున్నారు. గంట పాటు సాగిన ఈ షోను మహిళలు, యువత, అధిక సంఖ్యంలో వీక్షించారని, దీంతో ఈ షో నెంబర్ వన్ షో గా నిలిచిందని బుల్లితెర వర్గాలు చెప్పాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus