Koratala Siva: ఆరోజు నేను బాధపడిన మాట నిజమే.. కానీ :కొరటాల

  • June 23, 2021 / 03:51 PM IST

బోయపాటి శ్రీను- కొరటాల శివ.. ఇద్దరూ కూడా టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. మాస్ ఆడియన్స్ లో వీళ్ళ సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం కొరటాల.. చిరు తో ‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, బోయపాటి.. బాలయ్యతో ‘అఖండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా… గతంలో ‘సింహా’ చిత్రం కథ విషయంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘సింహా’ చిత్రానికి బోయపాటి .. ‘కథ, మాటలు రెండిటికీ పేరు వేయను ఏదో ఒకదానికి మాత్రమే నీ పేరు వేస్తాను’ అంటూ కొరటాలతో చెప్పాడట.

దీంతో కొరటాల అసహనానికి గురయ్యి రెండిటికి పేరు వేయొద్దని చెప్పి వెళ్లిపోయినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం పై కొరటాల ఇటీవల ఓ సందర్భంలో మళ్ళీ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘నాకు తెలిసి అప్పుడు ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఇవి అన్ని పరిశ్రమల్లోనూ చోటుచేసుకునేవే..! అయితే సినీ పరిశ్రమ అనే సరికి ఇలాంటి విషయాలు కొంచెం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. ఆరోజు ఓ విధంగా నాకు మంచే జరిగింది అని నేను భావిస్తున్నాను. ఆ టైంలో నేను బాధ పడిన మాట వాస్తవమే..!

కానీ ఆ రోజు అలా జరగక పోతే.. ఫాస్ట్ గా ఎదగాలి అనే ఆలోచన నాకు వచ్చేది కాదు. ‘ఈరోజుకి ఇది చాలు లే’ అన్నట్టు సరిపెట్టుకునేవాడిని. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల నేను మంచి కథలు రాసుకున్నాను. వాటిని తెరకెక్కించి విజయాలు అందుకున్నాను. ఈరోజు మేము బాగానే రాణిస్తున్నాం కాబట్టి.. ఆ విషయం గురించి ఇంకా ఆలోచించడం అవసరం నేను అనుకుంటూ ఉంటాను. ఒకటి మాత్రం నిజం.. ఇక్కడ ప్రతి ఒక్కరం గుర్తింపు కోసమే కష్టపడి పని చేస్తున్నాం” అంటూ కొరటాల చెప్పుకొచ్చారు.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus