ప్రిన్స్…టాప్ హీరోలకు షాక్ ఇచ్చాడు!!!

  • July 21, 2016 / 10:53 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం’ ఎవ్వరూ ఊహించని డిజాస్టర్ ను చవి చూసింది. అయితే ఆ తరువాత మహేష్ తను తమిళ దర్శకుడు ‘మురుగుదాస్’తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే….టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం మహేష్ తన నిర్ణయంతో ఇద్దరు హీరోలకు ఒకేసారి చాక్ ఇచ్చాడు. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం, ఎవరా హీరోలు అంటే…మురుగుదాస్ సినిమా సంగతి పక్కన పెట్టి, మహేష్ ఇప్పుడు కొరటాల శివ తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిట్ చాలా అవసరం కావడంతో అలా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే మహేష్ తో కొరటాల శివ అన్న వార్త వినగానే షాక్ లో ఉన్న ఆ టాప్ హీరోలెవరు అంటే ఒకటి తనతో ప్రస్తుతం సినిమా తీస్తున్న జూనియర్ ఎన్.టి.ఆర్ ఒకరైతే, మరొకరు కొరటాల శివతో త్వరలో సినిమా తీద్దామనుకున్న రాం చరణ్. ఇప్పటికే కొరటాల మహేష్ తో తీసిన శ్రీమంతుడు ఆ ఇద్దరు ఊహించని రేంజ్ లో వసూళ్లను రాట్టింది. అయితే మరోసారి ఇద్దరు కలిసి సినిమా చేయాలని ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో ఉన్నారు ఆ ఇద్దరు హీరోలు. అంతేకాకుండా ఈసారి కొరటాల మహేష్ ఇద్దరు ఇండస్ట్రీని షేక్ చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నట్లు ఇట్టే అర్ధం అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus