‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ పైనే ఆశలన్నీ..!

  • January 19, 2019 / 11:30 AM IST

సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ వచ్చిన మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాకుడు’ చిత్రం మంచి టాక్ ను దక్కించుకున్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది. నందమూరి బాలకృష్ణ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం కనీసం 25 కోట్లు వసూళ్ళను కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. గత సంక్రాంతికి (2018 లో) విడుదలైన నందమూరి బాలకృష్ణ చిత్రం ‘జై సింహా’ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ మంచి కల్లెక్షన్లని రాబట్టి.. కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకుంది. అయితే ఈసారి మంచి రివ్యూలు, మంచి ‘మౌత్ టాక్’ వచ్చినప్పటికీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కనీస వసూళ్ళను రాబట్టలేకపోయింది. ఈ చిత్ర ఫలితం అభిమానాలుకన్నా, హీరో నందమూరి బాలకృష్ణ కన్నా కూడా ఎక్కువగా ఈ సినిమాను ఎంతో ప్రేమించి ఇష్టపడి తెరకెక్కించిన క్రిష్ కే చాలా బాధిస్తుందట.

ఈ కారణంగానే బయటకి కూడా రావట్లేదంట క్రిష్. ఈ చిత్రం పై ఎన్నో అసలు పెట్టుకుని కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ చిత్రాన్ని కూడా వదిలేసి మరీ ఈ చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండో పార్ట్ అయిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ‘కథానాయకుడు’ మొదటి పార్ట్ లో ఎక్కడ తప్పులు జరిగాయో జాగ్రత్తగా విశ్లేషించుకుని అవి ‘మహానాయకుడు’ లో రిపీట్ కాకుండా చూసుకోవాలని భావిస్తున్నాడట. దీనికోసం బాలయ్య ను మరో వారం రోజులు ఎక్కువ టైం అడిగాడట. దీనికి బాలయ్య కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న క్రిష్ కు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus