చరణ్ ఎత్తుని చిత్తుచేయనున్న క్రిష్ టీమ్

  • January 4, 2017 / 12:03 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుధవారం చేసిన ప్రకటనతో టాలీవుడ్ ఒక్కసారిగా వేడెక్కింది. జనవరి 11 న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించి సినీ యుద్ధానికి తెరలేపారు. విడుదల తేదీని ఖరారు చేయడంలో పెద్ద విశేషం ఏమి లేదుగాని .. తాను బాలయ్య చిత్రానికి మేలు చేయాలనే ముందుగా రిలీజ్ చేస్తున్నామని చెప్పడం.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర బృందానికి  ఆగ్రహం తెప్పించింది. ఫస్ట్ డే కలక్షన్ల రికార్డులు సృష్టించడానికి మెగా ప్లాన్ వేసి.. తెలివిగా మాట్లాడడం చరణ్ కే సాధ్యమైందని విమర్శిస్తున్నారు. ఎలాగైనా చరణ్ ఎత్తుని చిత్తు చేయాలనీ భావిస్తున్నారు.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ వీఎఫ్ ఎక్స్ పనుల నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ కి రానున్నారు. రేపు (గురువారం) గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను సెన్సార్ కోసం పంపించనున్నారు. అక్కడనుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచిననున్నట్లు తెలిసింది. ఇదివరకు 12 న మూవీ వస్తుందని డైరక్టర్ చెప్పారు. ఆ డేట్ కంటే ముందుగానే శాతకర్ణి విడుదలయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంపై రేపు సాయంత్రం లోపు ప్రకటన వెలువడనుంది. బహుశా 11 తేదీనే బాలయ్య కూడా బరిలో దిగనున్నట్లు  సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus