మాల్దీవుల్లో కృష్ణంరాజు ఫ్యామిలీ హల్ చల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 20, 2022 / 04:10 PM IST

ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సెలబ్రిటీలు మాల్దీవుల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హనీమూన్ ట్రిప్ తో మొదలైన ఈ ట్రెండ్ ను.. ఆ తరువాత రకుల్ ప్రీత్ సింగ్, దిశా పటాని,ప్రణీత, శాన్వి శ్రీవత్స.. వంటి హీరోయిన్లు కూడా మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ తరువాత నాగ చైతన్య, సమంత… నిహారిక,చైతన్య.. జంటలు కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వచ్చారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫోటోలను కూడా మంచు లక్ష్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యామిలీ కూడా సైలెంట్ గా మాల్దీవులకు చెక్కేశారు. అలా అని ప్రభాస్ అక్కడికి వెళ్ళలేదండోయ్..! అతని పెదనాన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ మాత్రమే వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కృష్ణంరాజు గారి సతీమణి శ్యామల దేవి గారితో పాటు అతని కూతుర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి వంటి వారు ఉండడాన్ని మనం గమనించవచ్చు.

వీరంతా వైట్ అండ్ వైట్ దుస్తుల్లో దిగిన ఫోటో హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. కృష్ణంరాజు గడ్డం పెంచి ఒక డాన్ మాదిరి నిలబడి ఉన్న ఫోటో కూడా ఉప్పలపాటి వారి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈయన ప్రభాస్ తాజా చిత్రమైన ‘రాధే శ్యామ్’ లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus