పవన్ కి అత్తగా క్రేజీ నటి

  • November 4, 2016 / 07:36 AM IST

జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో రెండు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి నవంబర్ 5న ముహూర్త ఖరారైన విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి.హీరోయిన్ గా రిటైర్ అయిపోయిన భామలను అత్తలుగా చాలామంది దర్శకులు మళ్ళీ ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. కానీ వారితోపాటు ఆ పాత్రకు కొంత గౌరవాన్ని కూడా తీసుకొచ్చిన దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ అని ఒప్పుకుని తీరాల్సిందే.

హీరోయిన్ గా కెరీర్ గుడ్ బై చెప్పిన నదియా తెలుగులో తొలిగా కనపడింది ‘మిర్చి’ సినిమాలోనే అయినా మొదట సంతకం చేసింది ‘అత్తారింటికి దారేది’ సినిమాకి. ఈ సినిమా నదియా నటనకు ప్రేక్షకుల ప్రశంసలతో అవకాశాలు వెల్లువెత్తాయి. అదే అత్తని తన తర్వాతిలోనూ చూపించిన త్రివిక్రమ్ తాజా సినిమాకి మాత్రం కొత్త అత్తని వెతికి పట్టుకున్నారు. నిన్నటితరం హీరోయిన్లలో ఒకరైన తమిళ నటి కుష్బూ త్రివిక్రమ్-పవన్ మూడో సినిమాలో నటించనున్నారట. కుష్బూ గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన సంగతి గుర్తుందా..? తొలుత ఈ సినిమా పొలిటికల్ డ్రామా అన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ భ్రమ కాస్త తొలిగిపోయినట్టయింది. ఈ కొత్త అత్తకి ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus