మేఘ ఆకాష్ ఛాన్స్ ని అందుకున్న లావణ్య త్రిపాఠి

  • August 4, 2017 / 11:50 AM IST

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న బ్యూటీ మేఘా ఆకాష్.గౌత‌మ్‌మీన‌న్, ధ‌నుష్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్న మేఘ.. నితిన్ తో కలిసి తెలుగువారికి దగ్గరి కాబోతోంది. నితిన్ లై సినిమాలో హిరోయిన్‌గా ఈమె నటిస్తోంది. ఇది నిర్మాణ దశలో ఉండగానే మరో ప్రాజక్ట్ కి సంతకం చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ “ఉన్నదీ ఒకటే జిందగీ” సినిమా చేస్తున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. రెండో హీరోయిన్ గా మేఘ ఆకాష్ ఓకే చెప్పింది.

అయితే ఆమెకు అదే సమయంలో నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్ దక్కింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, రామ్ సినిమాకి డేట్స్ విషయంలో క్లాష్ వచ్చింది. దీంతో మేఘ “ఉన్నదీ ఒకటే జిందగీ” సినిమాను వదులుకుంది. ఆ ప్లేస్ లో కొత్తగా లావణ్య త్రిపాఠి ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి యుద్ధం శరణం సినిమాలో నటిస్తున్న లావణ్య, రామ్ మూవీ షూటింగ్ లోను జాయిన్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus