Maadhavi Latha: రాజు ఆత్మహత్యపై మాధవీలత షాకింగ్ పోస్ట్!

  • September 16, 2021 / 07:36 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటి మాధవీలత సైదాబార్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడైన రాజు ఆత్మహత్య గురించి ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టారు. రేపిస్ట్ చనిపోయాడనేది తాను నమ్మనని మాధవీలత చెప్పుకొచ్చారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడానికి పచ్చబొట్టు ఒక్కటే ఆధారం కాదని మాధవీలత అన్నారు. రాజు భార్యను పిలిపించి అతని శరీరం మొత్తం చూసి అప్పుడు అతను రాజు అవునో కాదో తేల్చాలని మాధవీలత సూచించారు.

ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించడానికి పక్కా ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేసిందని మాధవీలత పేర్కొన్నారు. ఇలా చేయడం న్యాయం కాదని రాజు చచ్చాడని తాను ఇప్పుడే నమ్మలేనని మాధవీలత తెలిపారు. ప్రజలను పోలీసులు, ప్రభుత్వం పిచ్చోళ్లను చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని మాధవీలత అన్నారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మాధవీలత పోస్ట్ కు ఎక్కువమంది నెటిజన్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రాజు ఆత్మహత్య గురించి చిరంజీవి, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

పాపకు న్యాయం జరిగిందంటూ నిందితుడిని దేవుడు శిక్షించాడంటూ సెలబ్రిటీలు తమ పోస్టుల్లో వెల్లడించారు. రాజు ఆత్మహత్య గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో మాధవీలత చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నారి పేరెంట్స్ కూడా రాజు మృతదేహాన్ని పరిశీలించి ఆ శవం నిందితుడు రాజు శవమో కాదో తేలుస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus