శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మదరాసి’. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పైగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల ‘మదరాసి’ పై పెద్దగా బజ్ లేదు. కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా ఈ సినిమాపై కొంతమంది ఫోకస్ ఉంది.
అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ అయితే చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను సాధించింది ‘మదరాసి’. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.37 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.15 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.07 cr |
కృష్ణా + గుంటూరు | 0.12 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 0.89 cr(షేర్) |
‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.89 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.58 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే ఏమాత్రం చిన్నది కాదు. నెగిటివ్ టాక్ వల్ల వీకెండ్ ఎలా నిలబడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.