Mahesh Babu: ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

  • September 25, 2021 / 02:08 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఎక్కువగా ఓటీటీ కంటెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ రానా దగ్గుబాటి నాగార్జున వంటి వారు అటు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. అక్కినేని నాగ చైతన్య కూడా మంచి కంటెంట్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఓటీటీ ఎంట్రీపై మహేష్ బాబు కూడా ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల ఒక బ్రాండ్ ఈవెంట్ సమావేశంలో పాల్గొన్న మహేష్ తన భవిష్యత్తు సినిమాల గురించి మాట్లాడుతూ

అలాగే వెబ్ సిరీస్ లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయంపై కూడా వివరణ ఇచ్చాడు. నేను వెబ్ సిరీస్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ప్రస్తుతం వాటిని చూడటంలో మాత్రమే ఉన్నాను. ఇప్పటి వరకు నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఎవరికి తెలుసు. భవిష్యత్తులో ఉండవచ్చు అంటూ మహేష్ బాబు తన వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను గీత గోవిందం ఫేమ్ పాతాశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మహేష్, రాజమౌళి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నాడు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus