మంచి కారణం కోసం కలవనున్న మహేష్ బాబు, చిరంజీవి!

  • December 20, 2017 / 12:27 PM IST

సామజిక సేవ కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందు ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకొని కోట్లు వెచ్చించి రూపురేఖలను మారుస్తున్నారు.  వీరిద్దరూ మరో మంచి పనికోసం కలవనున్నారు. వచ్చే ఏడాది అమెరికాలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏర్పాటు చేయబోతోన్న ఓ చారిటీ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, మహేష్ బాబు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వారిద్దరిని చూసేందుకు అమెరికాలో నివసించే తెలుగు వారు భారీసంఖ్యలో హాజరు అవుతారని మా భావిస్తోంది.

ఈ సందర్భంగా ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు “మా” ఈ విరాళాలను సేకరించనుంది.  ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ లో పాల్గొంటున్నారు.  హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన 1840 ల నాటి సెట్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై  భారీ అంచనాలున్నాయి. అలాగే మహేష్ బాబు తొలి సారి ముఖ్యమంత్రిగా చేస్తున్న భరత్ అనే నేను మూవీ పై కూడా క్రేజ్ నెలకొని ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కార్తె కుడిలో సాగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus