Mahesh Babu: అతనే బెస్ట్ అంటున్న మహేష్ బాబు!

  • July 9, 2021 / 07:53 PM IST

సాధారణంగా స్టార్ హీరోలు సినీ, రాజకీయ ప్రముఖులకు, తమ కుటుంబ సభ్యులకు మాత్రమే సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అతని మేకప్ మ్యాన్ పట్టాభికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ బాబు శైలి భిన్నమనే సంగతి తెలిసిందే. పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు కావడానికి మహేష్ బాబు పెద్దగా ఇష్టపడరు.

అయితే సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన మేకప్ మ్యాన్ పట్టాభి గురించి చెబుతూ తనకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ పట్టాభి అని మహేష్ పేర్కొన్నారు. పట్టాభికి 2020 సంవత్సరం అద్భుతంగా ఉండాలని పట్టాభిపై ప్రేమ, గౌరవం తనకు అలాగే ఉంటాయని మహేష్ బాబు పేర్కొనడం గమనార్హం. మేకప్ మ్యాన్ పుట్టినరోజును గుర్తు పెట్టుకుని విష్ చేసిన మహేష్ బాబు గొప్పదనాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తుండగా మహేష్ కు విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారని తెలుస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలో మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus