Mahesh Babu: ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసిన మహేష్!

  • December 13, 2021 / 01:26 PM IST

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మరొక కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలతోనే కాకుండా యాడ్స్ ద్వారా మంచి ఆదాయం అందుకునే మహేష్ గతంలో కేవలం యాడ్స్ ద్వారానే సొంత ఇంటిని నిర్మిచుకున్నాడు. ఇక ఇటీవల సూపర్ స్టార్ హైదరాబాద్ లోని లగ్జరీ ఏరియా జూబ్లీహిల్స్‌లో కొత్త ప్లాటు కొనుగోలు చేసినట్లు సమాచారం. దేశంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ లో ఇటీవల మళ్ళీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది.

ఇక ఇటీవల మహేశ్‌బాబు అనేక రకాల చర్చలు జరిపి కొత్త ప్లాటును కొన్నారు. స్థలం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరానికి చెందిన యర్రం విక్రాంత్‌రెడ్డి అనే బిజినెస్ మెన్ తన 1442 గజాల ప్లాటులో ఉన్న పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటిని నిర్మించాలని అనుకున్నాడట. అయితే మళ్ళీ దాన్ని విక్రయానికి పెట్టడంతో మహేష్ బాబు పోటీ పడి మొత్తంగా 26కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. స్టాంప్‌డ్యూటీ కింద రూ.1.43 కోట్లు అలాగే ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారట.

నవంబరు 17న ఇందుకు సంబంధించిన సేల్‌డీడ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు.

మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ తో కూడా మరొక సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి అనంతరం మొదలయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళితో కూడా ఒక సినిమాకి కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus