సమంతను ప్రశ్నిస్తున్న మహేష్ బాబు అభిమానులు!

  • September 12, 2018 / 07:32 AM IST

అక్కినేని కోడలు సమంత అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. మంచి పనులను చేస్తూ నెటిజనులతో అభినందనలు అందుకుంటుంటారు. తొలిసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎందుకో వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా సమయంలో ఆ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో తాకుతూ హీరోయిన్ కృతి సనన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ బాబు అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి.

తాజాగా సమంత భర్త అక్కినేని నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా రేపు విడుదలకానుంది. ఈ సినిమాకు చెందిన ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్, చైతు పాదాలను ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. అంతేకాదు తన మొహం మొత్తాన్ని మొత్తం చైతు పాదాల మీదపెట్టి తన్మయత్వం చెందే షాట్ ఈ పాటలో కనిపించింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మహేష్ బాబు సినిమా పోస్టర్ చూసి అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అను ఇమ్మానుయేల్ తో అలా ముద్దులు పాదాలపై పెట్టించుకోవడాన్ని ఏమనాలో? చెప్పాలంటూ సమంతని అడుగుతున్నారు. సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి భర్తని విమర్శిస్తుందా? నటనలో భాగమని సమర్థిస్తుందో చూడాలి. ఆమె నటించిన యు టర్న్ కూడా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో ఆమె బిజీగా ఉంది. అయినా ఆమె స్పందించే వరకు మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఆపడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus