మే 8 న ‘బుర్రిపాలెం’ వెళ్లనున్న మహేష్..!

  • April 30, 2016 / 02:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్ర ప్రదేశ్ లో తన స్వగ్రామం అయిన బుర్రిపాలెంను.. తెలంగాణ లో సిద్దాపురం ను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ భార్య నమ్రతా ఈ రెండు గ్రామాల్లోను పర్యటించి..

అక్కడ చేయవలసిన అభివృద్ది పనులపై సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం మే 8 న మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న స్వగ్రామం బుర్రిపాలెం లో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తుండగా.. ఈ చిత్ర ఆడియో మే 7 న విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus