యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ‘భరత్ అనే నేను’

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ ఈ సారి కూడా సమాజానికి మంచి సందేశం ఇవ్వనున్నారు. అతను పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ వచ్చే గురువారంతో ముగుస్తుందని చిత్ర బృందం తెలిపింది. నెక్స్ట్ షెడ్యూల్ పూణే లో ప్లాన్ చేశారు. అక్కడ కైరా అద్వానీ, మహేష్ లపై రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. దీని తర్వాత మార్చి 8 నుంచి ఆఖరి షెడ్యూల్ మొదలు కానుంది.

16 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో మిలిగిన ఒక పాటతో పాటు, సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ఓత్ జనవరి 26 న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. నేటి ముఖ్యమంత్రిగా మహేష్ ఫస్ట్ లుక్ లో అదరగొట్టారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీని తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus