వేగం పెంచిన భరత్ అనే నేను చిత్ర బృందం

  • February 12, 2018 / 06:39 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయాన్ని అందుకొని రెండేళ్లపైనే అవుతోంది. అతను చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్.. రెండూ నిరాశపరిచాయి. అందుకే హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులకు సంతోషాన్ని అందించడానికి శ్రమిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్ లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ మూవీని ఇప్పటికే ఒకసారి వాయిదా వేశారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించి.. తర్వాత ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ తేదీలో మార్పు ఉండకూడదని చిత్ర బృందం గట్టిగా సంకల్పించుకుంది. మహేష్ అయితే షాట్ కి షాట్ కి ఎక్కువ టైమే తీసుకోవడం లేదంట. తాను యాక్టివ్ గా ఉంటూ షూటింగ్ వేగాన్ని పెంచారని తెలిసింది. అలాగే కొరటాల శివ తన ఎడిటింగ్ టీమ్ ని కూడా అలర్ట్ చేసినట్లు తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకూడదని హెచ్చరించినట్లు టాక్. ఈ గురువారంతో క్లైమాక్స్ చితీకారం పూర్తి అవుతుంది. ఆ తర్వాత పూణే లో మహేష్, హీరోయిన్ కైరా అద్వానీలపై ఓ పాట తెరకెక్కించనున్నారు. దీని తర్వాత మార్చిలో మిగిలిన సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus