అల్లు అరవింద్ కి ఓకే చెప్పిన మహేష్ బాబు

  • June 22, 2018 / 06:43 AM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో మొదటి నుంచి మెగా హీరోలతోనే సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చారు. గత పదేళ్లలో 100 % లవ్, భలేభలే మగాడివోయ్… మినహా మిగతావన్నీ సొంత హీరోల చిత్రాలే. గత మూడు చిత్రాలు సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ విజయం సాధించాయి. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతని డేట్స్ ఖాళీగా లేకపోవడంతో.. ఇతర హీరోతో సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఇతర హీరో అంటే మెగా హీరోల్లోనే అని ఆలోచించండి.. తమ కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి మహేష్ బాబు తో మూవీ చేయాలనీ అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా మహేష్ ని కలవడం, అతను ఒకే చెప్పడం కూడా జరిగిపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ సోమవారం డెహ్రాడూన్ లో మొదలయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగా లతో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చారు. సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మాత్రం మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. గీతా ఆర్ట్స్ తో సుకుమార్ కి మంచి అనుబంధం ఉంది. సో మహేష్ నెక్స్ట్ మూవీకి సుకుమార్ డైరక్టర్ అయితే.. నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం అధికారికంగా ప్రకటించడానికి మరికొంతకాలం పడుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus