Mahesh Babu: గోవా ట్రిప్పేసిన మహేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న మహేష్ కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి గోవాకు బయలుదేరారు. మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితార గోవాకు వెళుతున్నారు. మహేష్ ఫ్యామిలీతో పాటు అతని స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు సమాచారం.

సితార తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సితార తన పోస్ట్ లో ఫోటోలతో పాటు నాన్నతో ఫ్లైట్ జర్నీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కూడా గోవాలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోవాలో భారీ సెట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. గోవాలో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ మహేష్ తో యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేయనున్నారు.

ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్ ను ఎంజాయ్ చేయాలని మహేష్ భావిస్తున్నట్టు భోగట్టా. మహేష్ జర్నీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితమే గోవా షెడ్యూల్ షూటింగ్ జరగాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. మహేష్ కెరీర్ లో సర్కారు వారి పాట మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

1

2

3

4

5


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus