కూతురితో కలిసి మొక్కలు నాటిన మహేష్ బాబు!

  • July 31, 2018 / 06:07 AM IST

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి( ఈ నెల 27)ని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ “హరితహారం”లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన ఎంపీ కవిత.. తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆమె దర్శకధీరుడు రాజమౌళి కి ఛాలెంజ్ విసిరారు. కవిత విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి.. తన ఫామ్ హౌస్‌లో మర్రి చెట్టు, గుల్మొహర్ చెట్టు, నిమ్మ చెట్టు లను నాటి మంత్రి కేటీఆర్ తో పాటు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.

అతను కూడా మొక్కలు నాటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ ని సంతోషంగా స్వీకరించిన మహేష్ నిన్న (సోమవారం) త‌న కూతురు సితార‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. తనను ఇలాంటి ఛాలెంజ్‌ కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా త‌న కూతురు సితార‌, కొడుకు గౌతంతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపెల్లికి ఆయ‌న హరితహారం గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మహేష్ విసిరిన ఛాలెంజ్ ని వంశీ పైడిపెల్లి ఎప్పుడు స్వీకరిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus