Mahesh Babu: రేట్లు చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. టీ, ఇడ్లీ, బజ్జీ ఎంతంటే?

  • December 8, 2022 / 07:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో స్టార్ హీరోగా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపారవేత్తగా మహేష్ బాబు సక్సెస్ అవుతున్నారు. తాజాగా నమ్రత పేరుపై ఒక రెస్టారెంట్ ఓపెన్ కాగా ఈ రెస్టారెంట్ లో రేట్లు చూసి మహేష్ అభిమానులు షాకవుతున్నారు. కప్ టీ 80 రూపాయలు, రెండు ఇడ్లీ 90 రూపాయలు, ప్లేట్ బజ్జీ 125 రూపాయలు ఉండటంతో ఈ రేట్లను చూసి షాకవుతున్నారు.

మిడిల్ క్లాస్ వాళ్లు తినే రేంజ్ లో రేట్లు ఉండి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో రేట్లు తగ్గిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ రెస్టారెంట్ లో రేట్లు తగ్గించకపోతే డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ రెస్టారెంట్ పై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అయితే రెస్టారెంట్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ రెస్టారెంట్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్స్, నమ్రత పేర్లతో ఏఎన్ రెస్టారెంట్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. చుక్కలు కనిపించేలా రేట్లు ఉండటంతో రెగ్యులర్ గా ఈ రెస్టారెంట్ లో తినాలని భావించే వాళ్లకు మాత్రం షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన పనులు మొదలయ్యాయనే సంగతి తెలిసిందే.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ 2023 జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ పూజా హెగ్డే జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మహర్షి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ఈ జోడీ మళ్లీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus