Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ తో మహేష్.. ఫ్యాన్స్ కు పండగే!

  • September 19, 2021 / 04:30 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. తనదైన వాక్చతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ షో ద్వారా మరింత వినోదం పంచడానికి టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులను షోలోకి అతిథులుగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఈ షోలో గెస్ట్ గా పాల్గొని సందడి చేయగా.. రీసెంట్ గా రాజమౌళి, కొరటాల శివలాంటి దిగ్గజాలను షోలోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ షోలోకి తీసుకురాబోతున్నారు. మహేష్ పాల్గొనే ఎపిసోడ్ ను ఈ ఆదివారం రికార్డ్ చేస్తారు. ఎప్పుడు ప్రసారం చేస్తారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం అటు బిగ్ బాస్, ఇటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. టీఆర్ఫీ పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బిగ్ బాస్ లోకి కానీ బిగ్ బాస్ స్టేజ్ మీదకు కానీ సెలబ్రిటీలు ఇంకా ఎంటర్ అవ్వలేదు.

నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం రామ్ చరణ్ అలానే ‘మ్యాస్ట్రో’ టీమ్ సందడి చేశారు. ఈ రెండు షోలకు రేటింగ్స్ కూడా ఒకే రేంజ్ లో వస్తున్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus