Mahesh Babu: త్రివిక్రమ్ కోసం ఆ పని చేస్తున్న సూపర్ స్టార్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారా..? సర్కారు వారి పాట సినిమాను ఈ ఏడాది దసరా పండుగ తరువాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గతేడాది జూన్ నెలలో ప్రకటించారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఆగిపోవడంతో త్రివిక్రమ్ తన తరువాత సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించాలని భావిస్తున్నారు. మే నెల 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా తరువాత ఏడాదికి పైగా గ్యాప్ రావడంతో త్రివిక్రమ్ త్వరగా మహేష్ సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ తరువాత సర్కారు వారి పాట సినిమాను రిలీజ్ చేస్తే వచ్చే ఏడాది సమ్మర్ లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాను రిలీజ్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో నటించబోతున్నారని సమాచారం. కరోనా విజృంభణ తగ్గితే సర్కారు వారి పాట మూవీ షూటింగ్ మరింత వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus