గ్యాప్ తీసుకోబోతున్న మహేష్ బాబు..!

  • November 5, 2019 / 03:20 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మరో మూడు వారాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాబోతుందని సమాచారం. పక్క మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరెక్కబోతుందని సమాచారం. ‘మహర్షి’ తరువాత ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా మహేష్ ఈ చిత్రాన్ని పూర్తిచేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేస్తాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ మళ్ళీ ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నే నిర్మించబోతున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఎటువంటి క్లారిటీ లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పూర్తికాగానే మహేష్ 3 నెలలు గ్యాప్ తీసుకుంటాడనేది తాజా సమాచారం. సాధారణంగా సినిమాకి.. సినిమాకి మధ్య మహేష్ చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు. ఆ గ్యాప్ లో తన తదుపరి సినిమా కోసం కథలు వింటుంటాడు. అయితే ‘మహర్షి’ తరువాత అనిల్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు కాబట్టి వెంటనే సినిమా మొదలు పెట్టాశాడు మహేష్. అయితే ఇప్పుడు ఇంకా తన తదుపరి సినిమా పై కసరత్తులు మొదలుపెట్టలేదు. కాబట్టి వంశీ పైడిపల్లి సినిమా కూడా గ్యారంటీ అని చెప్పలేం..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus