Mahesh Babu, Trivikram: సూపర్ స్టార్ మూవీతో పాయల్ రాత మారుతుందా?

  • October 13, 2021 / 10:56 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ గత సినిమాలు అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా పాయల్ రాజ్ పుత్ సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అయితే పాయల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పాయల్ ఆ తర్వాత నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

సూపర్ స్టార్ సినిమాతో పాయల్ రాత మారుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఇతర స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో పాయల్ కు హీరోయిన్ ఆఫర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కితే పాయల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కే అవకాశాలు అయితే ఉంటాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస ఫ్లాపుల వల్ల సినిమాల ఎంపిక విషయంలో పాయల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus