మహేష్ ఎదురు చూసినా… ఉపయోగం లేకుండా పోయింది..?

  • February 25, 2019 / 03:55 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా ఓపిక ఎక్కువే. షూటింగ్ సమయాల్లో ఎన్ని టేకులకైనా రెడీ అంటూ ముందుకు సాగుతాడని… రిస్కీ షాట్స్ ని సైతం లెక్క చేయకుండా దూసుకుపోతాడని… దర్శక నిర్మాతలు పదే పదే చెప్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన సహనం కోల్పోయాడట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘మహర్షి’ చిత్రాన్ని చేస్తున్నాడు మహేష్. దిల్ రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి… కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ గానూ.. రైతు గాను… క్రికెటర్ గానూ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్లో భాగంగా… హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న షూటింగుకి అనుకోని అవాంతరం ఎదురైందట. ఫిబ్రవరి 24 ఉదయం నుండీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేసుకోవడానికి ‘మహర్షి’ టీమ్ అధికారుల నుండీ ముందుగానే అనుమతులు తీసుకుందట. అయితే భద్రతా సంబంధమైన కొన్ని సమస్యల సంభవించడంతో…, అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్టు తెలుస్తుంది. ‘హై అలర్ట్’ ప్రకటించిన కారణంగా, అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని తెలుస్తుంది. ఈ కారణంగా 5 గంటలపాటు తన క్యారవాన్ లో ఎంతో ఓపికగా ఎదురు చూసిన మహేష్…. ఓపిక నశించడంతో తిరిగి వెళ్ళిపోయాడట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus