అలా అయితే దర్శకుడు పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే..!

  • October 13, 2020 / 10:43 PM IST

\మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. దర్శకుడు పరశురామ్ అయితే కొద్దిరోజుల ముందే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్ల వేట మొదలుపెట్టాడు. అయితే అనూహ్యంగా ‘సర్కారు వారి పాట’ యూనిట్ సభ్యులకు వీసా సమస్య వచ్చి పడిందట.

దాంతో మరో 2నెలల పాటు ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ బాబు ఆలోచనలు కూడా మారిపోయేలా ఉన్నాయని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. స్క్రిప్ట్ ఫైనల్ అయితే త్రివిక్రమ్ సినిమానే మొదట సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడట. అలా అయితే పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే అని చెప్పాలి..! ఎదుకంటే పరశురామ్.. నాగ చైతన్యతో సినిమా చేసుకోవడానికి రెడీగా ఉన్న టైములో..

మహేషే ఏరి కోరి మరీ తనతో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య దగ్గరకు పరశురామ్ వెళ్ళాలి అనుకున్నా.. అతను ‘లవ్ స్టోరీ’ తో పాటు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రానికి కూడా కమిటయ్యాడు. కాబట్టి ‘సర్కారు వారి పాట’ కనుక ఆగిపోతే పరశురామ్ కు పెద్ద ఇబ్బందే. అందులోనూ 2 ఏళ్ళ పైనే సినిమా మొదలుపెట్టకుండా అతను ఖాళీగా ఉంటూ వచ్చాడు. పోనీ మరో హీరోతో సినిమా చేద్దామనుకున్నా… మరో 6నెలల వరకూ ఏ హీరో కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus