కుర్ర హీరోపై మహేష్ నమ్మకం!

  • December 18, 2020 / 05:43 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు హీరోగానే సినిమాలు చేశారు. ఆయనకి సొంత బ్యానర్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో బేనర్ పేరు వేసుకొని రెమ్యునరేషన్ కి బదులు వాటా తీసుకునేవాడు. కానీ ఎప్పుడూ కూడా ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోలేదు. అడివి శేష్ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నాడు మహేష్. తన ప్రొడక్షన్ లో ‘మేజర్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. బయట హీరోని పెట్టి సినిమా చేయడం విశేషమనే చెప్పాలి. కాబట్టి మహేష్ ఈ సినిమా విషయంలో చాలా శ్రద్ధ పెట్టి ఉంటారని అంతా అనుకున్నారు.

కానీ మహేష్ కనీసం ‘మేజర్’ కథ కూడా వినలేదట. స్క్రిప్ట్ వినకుండానే సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారట. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఇప్పటికీ కూడా మహేష్ కి ఈ సినిమా కథ తెలియదట. ఏ విషయాన్ని హీరో అడివి శేష్ స్వయంగా చెప్పారు. తాజాగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అడివి శేష్.. మహేష్ అసలు ‘మేజర్’ కథ వినలేదని చెప్పారు.

మహేష్, నమ్రత గారు తన మీద, తన టీమ్ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారని.. కాబట్టి మంచి సినిమా అందించాల్సిన బాధిత తనపై పెరిగిందని అడివి శేష్ అన్నారు. నమ్రత గారు మాత్రమే స్క్రిప్ట్ విన్నారని.. మహేష్ గారు వినకుండానే సినిమాకి ఓకే చెప్పారని వెల్లడించారు. ప్రొడక్షన్ కి సంబంధించిన ఏది కావాలంటే అది ఎరేంజ్ చేశారని.. గొప్ప సినిమా చేస్తున్నామంటూ నమ్రత గారు ప్రోత్సహించేవారు చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus