మలేసియాలో మహేష్, కొరటాల బృందం చర్చలు

  • February 8, 2017 / 06:36 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీంతో వీరి కలయికలో రానున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగా కొరటాల స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ స్క్రిప్ట్ పై డిస్కషన్ నిర్వహించడానికి హీరో, డైరక్టర్ కొన్ని రోజుల క్రితం మలేషియా  వెళ్లారు. వీరి వెంట రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి కథను ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ట్యూన్స్ కూడా ఎలా ఉండాలో ఇప్పుడే డిసైడ్ చేయనున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల పాటు వీరు మలేషియాలోనే ఉండనున్నారు.

ఫిబ్రవరి 10 వ తేదీన నగరానికి రానున్నారు. తర్వాత రోజు నుంచి మురుగదాస్ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈనెల 11 నుంచి ముంబై లో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ తో మహేష్ 23 మూవీ టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. అనంతరం మిగిలిన రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఆ తర్వాత కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ కి “భరత్ అను నేను” అనే పేరుని  పరిశీలిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus