ప్రభాస్ ని అందుకే పిలవలేదు : మంచు లక్ష్మి

  • October 10, 2016 / 12:10 PM IST

మోహన్ బాబు కుమార్తెగా పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి మంచు. నిర్మాతగా, నటిగా వెండితెరపై తన మక్కువ చాటుతోన్న లక్ష్మి బుల్లితెరపైనా ‘లక్ష్మి టాక్ షో’, ‘ప్రేమతో మీ లక్ష్మి’ తదితర కార్యక్రమాలతో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నారు. ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్బంగా పాత్రికేయులతో మాట్లాడిన లక్ష్మి పలు విషయాలను వారితో పంచుకున్నారు.

నిర్మాతగా చేసిన సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో సరైన కథ దొరికే వరకు మళ్ళీ నిర్మాణం చేపట్టానన్నారు. నటిగా ప్రస్తుతం చేస్తున్న ‘లక్ష్మి బాంబ్’ దీపావళికి విడుదలవుతుందని చెప్పిన లక్ష్మి, తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్న విషయాన్ని బయటపెట్టారు. తండ్రి మోహన్ బాబుతో ఓ పూర్తిస్థాయి సినిమా చేయాలని వున్నా అందుకు తగ్గ కథ దొరకటం లేదన్న ఆమె అందులో తాను నటించాల్సి వస్తేగనక ఇరువురి పాత్రలు పోటాపోటీగా ఉంటేనే చేస్తానని చెప్పారు.

ఇక ఆపదలో వున్నవారికోసం చేస్తోన్న ‘మేముసైతం’ కార్యక్రమం గురించి చెబుతూ పరిశ్రమలో అందరినీ సంప్రదించానని కొంతమంది నో అన్నా వచ్చినవారంతా చాలా సాయం అందించారని అన్నారు. ప్రభాస్ ని కూడా పిలవాలనుకున్నానని అయితే బాహుబలి సెట్స్ నుండి ప్రభాస్ ని బయటకు తీసుకొస్తే రాజమౌళికి కోపం వస్తుందేమో అని ఆ ప్రయత్నం మానుకున్నానని సరదాగా అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus