Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

మంచు విష్ణు (Manchu Vishnu) దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ (Kannappa) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్లు ఈ సినిమాలో నటించడం బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Manchu Vishnu

పాజిటివ్ టాక్ వల్ల ‘కన్నప్ప’ (Kannappa) కి ఈజీగా రికవరీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు విష్ణు (Manchu Vishnu) తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని భావిస్తున్నాడు. ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మారినప్పటి నుండి విష్ణు సినిమాలు కొంచెం తగ్గించాడు. మరోపక్క ‘కన్నప్ప’ (Kannappa) పై ఎక్కువ టైం పెట్టడంతో అతనికి మరో సినిమా చేసే ఛాన్స్ దొరకలేదు. పైగా ట్రేడ్లో కూడా మంచు విష్ణు ప్రాజెక్టు అంటే ఓ చిన్న చూపు ఉంది.

‘కన్నప్ప’ (Kannappa) తో ఆ అభిప్రాయాలు మారినట్టు తెలుస్తోంది. నటుడిగా కూడా ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు విష్ణు. ఈ క్రమంలో అతను తన నెక్స్ట్ సినిమా కూడా ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు విష్ణు తన నెక్స్ట్ సినిమాని ప్రభుదేవా దర్శకత్వంలో చేయబోతున్నాడట. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘పౌర్ణమి’ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో ప్రభుదేవా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తర్వాత తమిళం, హిందీ భాషల్లో చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. హిట్లు కూడా కొట్టాడు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ‘శివ శివ శంకర’ పాటకి ఇతనే కొరియోగ్రఫీ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోనే విష్ణుకి ఓ కథ చెప్పి ప్రాజెక్టు సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus