Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

భారీ అంచనాలు, భారీ తారాగణంతో రూపొందిన ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ కి ముందు ఎక్కువగానే వార్తల్లో నిలిచింది. విష్ణు టైటిల్ రోల్‌ పోషించిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుని తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ పొందింది. దానికి కారణం ప్రభాస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘కన్నప్ప’ లో ప్రభాస్ (Prabhas) పోషించిన పాత్ర బాగుంది. అందరినీ ఆకట్టుకుంది. చిత్ర విజయంలో ఈ పాత్ర కీలకం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

Manchu Vishnu

‘కన్నప్ప’ లో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఎంట్రీనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని, ఆయన రాకతోనే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిందని ప్రేక్షకులు, విశ్లేషకులు, మంచు మనోజ్ వంటి సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. అయితే అది పూర్తిగా కరెక్ట్ కాదు అంటూ మంచు విష్ణు (Manchu Vishnu) అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంచు విష్ణు మాట్లాడుతూ… “అందరూ ప్రభాస్ (Prabhas) వచ్చాకే సినిమా గ్రాఫ్ మారిందంటున్నారు.

కానీ అందులో పూర్తిగా నిజం లేదు. ప్రభాస్ (Prabhas) ఎంట్రీకి ముందే సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) నాకు మధ్య వచ్చే ఓ ఎమోషనల్ సీన్ నుండి ప్రేక్షకులు కథకు కనెక్ట్ అయ్యారు.ఆ సీన్‌ నుండే అసలైన మ్యాజిక్ మొదలైంది. అక్కడి నుండి సినిమా గ్రాఫ్ మారింది. ప్రభాస్ స్టార్ ఇమేజ్ కారణంగా ఆ హైప్ ఆయన ఎంట్రీకి దక్కింది కానీ, పునాది మాత్రం ముందే పడింది” అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. విష్ణు వాదన ఎలా ఉన్నా, సినిమా చూసిన వారి అభిప్రాయం, వచ్చిన రివ్యూలు మాత్రం మరో కథ చెబుతున్నాయి.

విష్ణు తన పాత్రకు ప్రాణం పోసి, సింగిల్ టేక్ మోనోలాగ్‌తో అదరగొట్టినా, సినిమాకు అసలైన “గేమ్ ఛేంజర్” మాత్రం రుద్ర పాత్రలో కనిపించిన ప్రభాసేనని రివ్యూయర్స్ తేల్చి చెబుతున్నారు.ప్రభాస్ ఎంట్రీ ,అతని కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. అలాగే మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. శరత్ కుమార్ చనిపోయే సీన్ కి ముందు విష్ణుతో వచ్చే కాంబినేషన్ సీన్ కొత్త ఫీల్ ఇచ్చింది. అక్కడి నుండి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు.

పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus